సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ థ్రిల్లర్ నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈసినిమాతో అశోక్ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఏమైంది ఈవేళ, బెంగాల్ టైగర్ వంటి సూపర్హిట్స్ అందించిన శ్రీసత్యసాయి ఆర్ట్స్ అధినేత కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.9గా ఈ సినిమా రూపొందనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేసాడు సంపత్ నంది. డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ వస్తున్న ఈ సినిమాకు ‘ఓదెల రైల్వేస్టేషన్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. కన్నడలో 25 చిత్రాలకు పైగా నటించిన వశిష్ట సింహ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నాడు. ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్యమైన పాత్రలో హీరోయిన్ హెభా పటేల్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. మరి టైటిలే డిఫరెంట్ గా వుంది.. సినిమా ఇంకెలా ఉంటుందో చూద్దాం.
Here it is.. the title poster of #OdelaRailwayStation, yet another special collaboration with my very own @KKRadhamohan garu introducing a dear friend #AshokTeja as director. Need all your blessings and support 🙏🏾@SriSathyaSaiArt @soundar16 @anuprubens @baraju_SuperHit pic.twitter.com/BqtdZmsMeQ
— Sampath Nandi (@IamSampathNandi) September 9, 2020
ప్రస్తుతం సంపత్ నంది హీరో గోపీచంద్ తో ‘సీటీమార్’ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ సంవత్సరంలో మొదలయిన ఈ సినిమా లాక్ డౌన్ కి ముందే మూడు షెడ్యూల్స్ లో 60% షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే కరోనా వల్ల సినిమా షూటింగ్లకు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: