కరోనా వైరస్ సోకడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం హాస్పిటల్లో చేరిన విషయం తెలిసిందే. అప్పటినుండి బాలుకి చికిత్స పొందుతూనే ఉన్నారు. ఇన్ని రోజుల్లో బాలు ఆరోగ్యం నిలకడగా ఉందని కొన్నిసార్లు.. ఆరోగ్యం క్షీణించిందని ఇలా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఈ రూమర్స్ పై బాలు తనయుడు ఎస్పీ చరణ్ స్పందించి నాన్న ఆరోగ్యంపై వచ్చే వార్తలను నమ్మకండి.. నేనే అప్ డేట్స్ ఇస్తా అని క్లారిటీ ఇచ్చారు. ఆ రోజు నుండి తనే అప్ డేట్స్ ఇస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పుడు తాజాగా బాలు ఆరోగ్యంపై మరో అప్ డేట్ ఇచ్చాడు చరణ్. తాజాగా షేర్ చేసిన వీడియో లో మాట్లాడుతూ.. వరుసగా నాలుగో రోజు నాన్న ఆరోగ్యం నిలకడగా ఉంది. మెల్లగా కోలుకుంటున్నారు. దేవుని ఆశీస్సులు, అభిమానుల ప్రార్ధనలతో సోమవారం మంచి శుభవార్త వినోబోతున్నారు అని పేర్కొన్నారు. మరి శుభవార్త అంటే డిశ్చార్జ్ అయ్యే వార్త ఏమన్నా చెప్తాడేమో. ఇదిలా ఉంటే కరోనా బారిన పడ్డ బాలు భార్య కరోనా నుండి కోలుకున్న సంగతి తెలిసిందే.
ఇక ఇదిలా ఉండగా బాలు త్వరగా కోలుకోవాలని సెలెబ్రిటీస్ దగ్గరనుండి సామాన్యుల వరకూ, ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రార్థనలు అందించారు.బాలు తొందరగా కోలుకొని ఆరోగ్యంగా తిరిగిరావాలని మనం కూడా కోరుకుందాం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: