కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారి ప్లాస్మా తో మరికొంతమంది కరోనా బాధితులను కాపాడవచ్చని తెలిసిన విషయమే. సైబరాబాద్ సి పి సజ్జనార్ ప్లాస్మా దానానికై ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సాధారణ ప్రజల తో పాటు సెలబ్రిటీస్ కూడా ప్లాస్మా డొనేట్ చేస్తున్నారు. బ్లడ్ డొనేషన్ వంటిదే ప్లాస్మా డొనేషన్ అనీ, భయపడాల్సిన అవసరం లేదనీ ప్రముఖ యాంకర్ అనసూయ ప్లాస్మా డొనేషన్ కై పిలుపు నిచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రేక్షకులను అలరిస్తూ అనసూయ సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతూనే తన పాత్రలకు ప్రాధాన్యం ఉన్న మూవీస్ ను ఎంపిక చేసుకుని నటిస్తున్నారు. పలు మూవీస్ లో నటిస్తూ బిజీగా ఉన్న అనసూయ సైబరాబాద్ పోలీసుల విజ్ఞప్తి మేరకు కరోనా నుండి కోలుకున్న వారి ప్లాస్మా దానానికై రిక్వెస్ట్ చేశారు. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ .. మన దేశం తో పాటు ప్రపంచ ప్రజలంతా కరోనా వ్యాధి తో పోరాడుతున్నారని, కరోనా వ్యాధి కి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని , ప్లాస్మా చికిత్స తో కొంత మంది కోలుకునే అవకాశం ఉందనీ , కరోనా నుండి కోలుకున్న 500ML ప్లాస్మాతో ఇద్దరి ప్రాణాలు రక్షించవచ్చని, కరోనా వ్యాధి నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని అనసూయ కోరారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: