విద్యుల్లేఖ రామన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. తెలుగులో రాజు గారి గది, సరైనోడు, భాగమతి వంటి పలు చిత్రాల్లో తనదైన కామెడీ తో నవ్వించింది. ఇక ఇదిలా ఉండగా విద్యుల్లేఖ రామన్ త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతుంది. ఫిట్ నెస్ ట్రైనర్ అయిన సంజయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని విద్యుల్లేఖ రామన్ తన ఇన్ స్ట్రాగ్రమ్ లో తెలిపింది. తనకి కాబోయే భర్త ఫోటోని షేర్ చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆగస్టు 26న తాము రోకా వేడుక చేసుకున్నామని చెప్పింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ వేడుక జరిగిందని… తాము మాస్కులు వేసుకుని ఫోటోల కోసం వాటిని తీసేసి మళ్లీ వేసుకున్నామని చెప్పింది. అయితే పెళ్లి ఎప్పుడు అనే విషయం మాత్రం చెప్పలేదు. మరి నిశ్చితార్థం సైలెంట్ గా చేసుకుంది.. పెళ్లి కూడా సైలెంట్ గా చేసుకుంటుందేమో..
ఇక విషయం తెలియడంతో పలువురు సెలబ్రిటీస్ విద్యుల్లేఖ కు అభినందనలు తెలిపారు. కంగ్రాట్స్ అక్కా అంటూ విద్యుల్లేఖ రామన్ కు వరుణ్ తేజ్ విషెస్ చెప్పారు. ఇంకా ధన్యబాలకృష్ణన్, రాశీఖన్నా ,పాయల్ రాజ్ పూత్,నభానటేష్ విషెస్ చెప్పారు. తమకు విషెస్ చెప్పిన వారందరికి ధన్యవాదాలు తెలిపింది విద్యుల్లేఖ. కాగా, విద్యుల్లేఖ తండ్రి ప్రముఖ తమిళ టెలివిజన్ నటుడు మోహన్ రామన్ అన్న సంగతి తెలిసిందే.
కాగా లాక్ డౌన్ లో టాలీవుడ్ లో ఎంతో మంది సెలబ్రిటీస్ పెళ్లి పీటలు ఎక్కారు. రానా, నితిన్, నిఖిల్, దర్శకుడు సుజీత్ వీరితో పాటు ఇంకా చాలా మంది పెళ్లిళ్లు లాక్ డౌన్ లోనే జరిగాయి. మొత్తానికి లాక్ డౌన్ సినిమాలకు కలిసి రాలేదు కానీ పెళ్లిళ్లకు మాత్రం బాగానే కలిసొచ్చింది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: