ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన మెహెర్ రమేష్ దర్శకుడిగా శాండల్ వుడ్ కు పరిచయం అయ్యి “వీరకన్నడిగ”, “అజయ్ ” వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ ను రూపొందించారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన సక్సెస్ ఫుల్ “కంత్రి “మూవీ తో మెహెర్ రమేష్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ మూవీ తరువాత యంగ్ రెబెల్ స్టార్ హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన “బిల్లా ” మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో మెహెర్ స్టైలిష్ మూవీ మేకర్ గా పేరుపొందారు. మెహెర్ దర్శకత్వంలో రూపొందిన “శక్తి “, “షాడో ” మూవీస్ నిరాశ పరిచాయి. ప్రస్తుతం డైరెక్టర్స్ అసోసియేషన్ కు ట్రెజరర్ గా మెహెర్ రమేష్ సేవలు అందిస్తున్నారు. కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ లో మెహెర్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా లాక్ డౌన్ కారణం గా సినీ కార్మికులు ఉపాధి కోల్పోయి పలు ఇబ్బందులకు గురి అయిన సమయంలో కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ ప్రారంభించబడింది. ఇప్పటికే రెండు సార్లు సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన ఈ సంస్థ మూడవ సారి వస్తువుల పంపిణీ ప్రారంభించింది . ఆ సందర్భంగా ఒక ఇంటర్వ్యూ లో దర్శకుడు మెహెర్ రమేష్ మాట్లాడుతూ … లాక్ డౌన్ కారణం గా సినీ కార్మికుల కష్టాలకు స్పందించి మెగా స్టార్ చిరంజీవి కార్మికులను ఆదుకునే ఆలోచనతో కరోనా క్రైసిస్ చారిటీ సంస్థ కు శ్రీకారం చుట్టారని , ఒక కమిటీ ని ఏర్పాటు చేశారని , చిరంజీవి కోటి రూపాయలు డొనేట్ చేశారని , ఆయిన ఇన్ స్పిరేషన్ తో టాలీవుడ్ హీరోలు, హీరోయిన్స్ , నిర్మాణ సంస్థలు విరాళాలు ఇచ్చారని , సినీ కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమంలో హీరోలు తమ సహాయ సహకారాలు అందించారని , కమిటీ సభ్యులతో పాటు మెహెర్ బాబా ట్రస్ట్ సభ్యులు సహకరించారని , మూవీ షూటింగ్స్ ప్రారంభం అయ్యేవరకు ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగాలని చిరంజీవి చెప్పారని, ఈ కార్యక్రమానికి సహకరించిన హీరోలపై మెహెర్ రమేష్ ప్రశంసలు కురిపించారు. మెగా స్టార్ చిరంజీవి , మెహెర్ రమేష్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందనుందని చిరంజీవి అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: