సక్సెస్ ఫుల్ “అందాల రాక్షసి “మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన లావణ్య త్రిపాఠి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. లాక్ డౌన్ బాధితులకు తన వంతు సాయం అందించిన లావణ్య , తన డిజైనర్ ఫ్రెండ్ తో కలసి మాస్క్ లు తయారు చేయించి ప్రజలకు అందుబాటులో ఉంచడమే కాకుండా , కొన్ని ఏరియాలలో మాస్క్ లను ఉచితంగా పంచిపెట్టారు. లాక్ డౌన్ సమయంలో హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయిన లావణ్య లాక్ డౌన్ సడలింపు తరువాత డెహ్రాడూన్ లోని తన స్వంత ఇంటికి చేరుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇంటికి చేరుకున్న ఆనందంలో లావణ్య మాట్లాడుతూ .. హైదరాబాద్ ను తన స్వంత ఊరుగా భావిస్తాననీ , ఫిల్మ్ ఇండస్ట్రీ కి సంబంధం లేని చాలామంది గ్రేట్ ఫ్రెండ్స్ ఉన్నారనీ , లాక్ డౌన్ సమయం లో హైదరాబాద్ లో చిక్కుకుపోయాననే ఫీలింగ్ రాలేదనీ , హెల్దీ లైఫ్ స్టైల్ కు అలవాటు పడిన తనకు ఐసొలేషన్ లో ఉండడం ఎంతో కష్టమని తెలిసిందనీ , లాక్ డౌన్ తరువాత హోమ్ సిక్ ఫీలింగ్ కలిగిందనీ , తన పేరెంట్స్ ను జనవరి లో కలిశాననీ , తమ పెట్ డాగ్ బ్రూనీ ని చాలా మిస్ అయ్యాననీ , అందరినీ చూడాలనిపించి PPE కిట్ ధరించి ట్రావెల్ చేసి ఇంటికి సేఫ్ గా చేరుకున్నాననీ , కరోనా టెస్ట్ లో 3రోజుల తరువాత నెగటివ్ వచ్చిందని, అయినా మాస్క్ తీయడానికి భయపడుతున్నాననీ , డెహ్రాడూన్ లో ఉన్న పేరెంట్స్ తనను చూసి చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యారనీ , ఇంటి ఫుడ్ ను ఎంజాయ్ చేస్తున్నాననీ , చాలా కాలం తరువాత కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేయడం ఆనందంగా ఉందని లావణ్య చెప్పారు.[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: