లాక్ డౌన్ లో చిరు ఇంట్లో ఉంటూ బాగానే కాలక్షేపం చేస్తున్నారు. ఇక లాక్డౌన్ సమయంలో సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన చిరు తన పోస్ట్లతో నెటిజన్స్కి కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. కరోనాపై అవగాహన కల్పిస్తూ పలు వీడియోలు సూచనలు ఇస్తూనే పలు ఇంట్రెస్టింగ్ విషయాలని షేర్ చేస్తున్నారు. అంతేకాదు అప్పుడప్పుడు వంటలు కూడా చేస్తున్నాడు. గతంలో తన తల్లికి దోశలు ఏసిపెట్టిన సంగతి గుర్తుండే ఉంటుంది కదా. ఇక ఇప్పుడు మరోసారి తనతల్లి కోసం మరో వంటను చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వంట ఏదో కాదు చేపల వేపుడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సండే ఖాళీగా ఉన్నాను.. బోరుకొడుతుంది ఏంచేద్దామా అని ఆలోచిస్తూ వంట చేస్తే ఎలా ఉంటుంది అని అనుకున్నా.. అది కూడా అమ్మకు నచ్చిన వంట చేసిపెడితే బాగుంటుందని… చిన్నప్పుడు మా కోసం అమ్మ చింతకాయ తొక్కుతో చేసిన చిన్న చేపల వేపుడు చేస్తున్నా అని చెప్పారు. అంతేకాదు ఆ వంట వీడియోను సోషల్ మీడియాలో అభిమానుల కోసం పంచుకున్నారు. వంట అయిపోయిన తర్వాత తల్లి అంజనా దేవి తింటుండగా బావుంది అంటుందో ఏమంటుందో తన గుండె వేగంగా కొట్టుకుంటోందని టెన్షన్ గా ఉందని కామెడీ చేశారు. ఇక చిరు వండిన స్పెషల్ చేపల ఫ్రైని తిని బావుంది అనగానే మెగాస్టార్ ఒక్కసారిగా ఏయ్ అంటూ సంబరపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు లూసిఫర్ సినిమా రీమేక్ కూడా చేయనున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: