బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ పూజాహెగ్డే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. పూజాహెగ్డే ప్రస్తుతం “రాధేశ్యామ్ “, “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ” మూవీస్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజాహెగ్డే బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ హీరోగా ఒక మూవీ , అక్షయ్ కుమార్ హీరో గా మరొక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయం లో పూజాహెగ్డే తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ , యోగా , కుకింగ్ వంటి వాటితో పాటు సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మూవీ జయాపజయాలపై పూజాహెగ్డే స్పందన ఆమె మాటల్లోనే .. చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టిన కొత్తలో ప్రతీ ఒక్కరూ శుక్రవారం వస్తుందంటే ఒత్తిడికి లోనవుతారని, ఎందుకంటే ఆరోజు నటీనటుల జాతకాలు ముడిపడి ఉంటాయి కాబట్టి అని , తాను నటించిన మూవీ రిలీజ్ అయితే తాను కూడా టెన్షన్ కు గురిఅయ్యేదానినని, ఏం జరిగినా మన మంచికే అనే సానుకూల ధోరణిని అలవర్చుకొన్నానని, నటిగా 100శాతం కష్టపడడం తన పని అని , మూవీ ఫలితం ప్రేక్షకుల చేతులలో ఉంటుందని , మూవీ విజయం సాధిస్తే కష్టానికి తగ్గ ఫలితం వచ్చిందనుకుంటానని , మూవీ ఫలితం నిరాశ కలిగిస్తే తప్పులు తెలుసుకుని , తాను నటించే మూవీస్ లో తిరిగి ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడతానని , విజయం సాధించడానికి మరింత కష్టపడతానని పూజాహెగ్డే చెప్పారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: