కరోనా వల్ల టాలీవుడ్ హీరోలు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా వుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది హీరోలు తమ పుట్టినరోజు వేడుకలు నిర్వహించొద్దని కోరగా ఇప్పుడు తాజాగా మహేష్ కూడా తన అభిమానులను అదే కోరుతున్నారు. ఈనెల 9వ తారీఖు మహేష్ పుట్టినరోజన్న సంగతి తెలిసిందే. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ కు పండగతో సమానం కదా.. ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పుట్టిన రోజు వేడుకలు ఘనంగా నిర్వహించాలని అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన పుట్టినరోజులు వేడుకలు జరపొద్దని అభిమానులను కోరుతున్నాడు మహేష్. ఈ సందర్భంగా తన ట్విట్టర్ లో ట్వీట్ కూడా చేసాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
‘ప్రియమైన అభిమానులకు… మీరు అందరూ నాకు తోడుగా ఉండటం నా అదృష్టం. నా పుట్టిన రోజు ఒక ప్రత్యేకమైన రోజుగా గుర్తు ఉండాలని మీరు చేస్తున్న మంచి పనులకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మీ అందరిని నేను అభినందిస్తున్నాను. ప్రస్తుతం కరోనాతో మనం అందరం చేస్తున్న ఈ యుద్దంలో సురక్షితంగా ఉండటం అనేది అన్నిటికంటే ముఖ్యం. నా పుట్టిన రోజున అభిమానులందరూ సామూహిక వేడుకలకు దూరంగా ఉండి క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా.. ప్రేమతో మీ మహేష్..’ అంటూ ఫ్యాన్స్కు సూచించారు.
— Mahesh Babu (@urstrulyMahesh) August 7, 2020
ఇక ఇదిలా ఉండగా లాక్ డౌన్ లో సూపర్స్టార్ మహేష్బాబు ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇంట్లోనే ఉంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్లో ఉంటున్నారు. ఇంట్లో పిల్లలు గౌతమ్-సితార తో చేసే అల్లరి, ఆట పాటలకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా పంచుకుంటూనే ఉన్నారు. అంతేకాదు కరోనా గురించి అవగాహన కూడా కలిపిస్తూ పలు సూచనలు, సందేశాలు కూడా ఇస్తున్నారు.
ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాను చేయనున్నాడు మహేష్. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: