టాలీవుడ్ లో చాలామంది సెలబ్రిటీస్ నిర్మాతలుగా మారుతున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టుకొని సినిమాలు చేయడానికి ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు అంటే వేరు… ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా మార్పులు వచ్చాయి. తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీసి కోట్లు కోట్లు లాభాలు గణించిన కొత్త కొత్త ప్రొడ్యూసర్స్ వున్నారు. ఇప్పుడు అందరూ నిర్మాతలుగా మారడానికి కూడా ఇదో కారణమని చెప్పొచ్చు. ఎవరో సినిమా తీసి హిట్ కొట్టి సొమ్ము చేసుకోడం కంటే లాభమో నష్టమో తామే సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా నిర్మాతగా మారిన మరో నటుడు కృష్ణుడు. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని నటుడు కృష్ణుడు. ఎన్నో సినిమాల్లో నటించాడు. ‘వినాయకుడు’ సినిమాతో హీరోగా మారిన ఆయన ఆ తరవాత కూడా చాలా సినిమాల్లో చేసాడు. అయితే గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఈ వినాయకుడు ఇప్పుడు నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన కూతురు నిత్య పేరు మీద ‘నిత్య క్రియేషన్స్’ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించాడు. అంతేకాదు ఈ బ్యానర్ లో ‘మై భాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్” అనే సినిమాను కూడా తీస్తున్నాడు. ఈ సినిమాకు జయరామ్ దర్శకత్వం వహించనున్నాడు.
ఇక ఇప్పుడు తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఏకంగా ప్రభాస్ నే తీసుకొచ్చాడు కృష్ణుడు. ప్రభాస్ చేతుల మీదుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఓ వీడియో ద్వారా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ మూవీ చూడాలని కోరాడు. ఇక ప్రభాస్ రిలీజ్ చేయడంతో ఈ సినిమాకు మంచి హైప్ వచ్చి చేరింది. ఇక ఈ సినిమాలో ఓటీటీ లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తుంది. మరి హీరోగా కమెడియన్ గా అందరిని బాగా ఆకట్టుకున్న కృష్ణుడు నిర్మాతగా కూడా తన సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అనేది చూడాలి.
బాహుబలి #Prabhas చేతుల మీదుగా మై బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్ ఫస్ట్ లుక్ లాంచ్..
వినాయకుడు ఫేమ్@iamkrishnudu తొలిసారి నిర్మాతగా వస్తున్న సినిమా #MyBoyFriendsGirlFriend ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసి కృష్ణుడి కి తన శుభాకాంక్షలందజేశారు ప్రభాస్.. pic.twitter.com/ey9rmUe6dS pic.twitter.com/SLCChVmQse
— Krishnudu✨ (@iamkrishnudu) August 7, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: