బ్రహ్మానందం అద్భుత చిత్ర కళ

Tollywood Ace Comedian Brahmanandam Brings Out His Artistic Talent During The Lockdown

ఎవరి పేరు వింటే ప్రేక్షకుల మదిలో గిలిగింతలు పుట్టి , వారి మోముల్లో చిరునవ్వులు పూస్తాయో అతనే కామెడీ కింగ్ బ్రహ్మానందం. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో బ్రహ్మానందం ప్రేక్షకులను అలరించారు. 1000 పైగా సినిమాలలో నటించి బ్రహ్మానందం గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందారు . పద్మశ్రీ పురస్కారంతో పాటు బెస్ట్ కమెడియన్ గా 6 నంది , ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కరోనా లాక్ డౌన్ సమయం లో బ్రహ్మానందం మరో కళకు శ్రీకారం చుట్టారు. చిత్రకళ ను సాధన చేస్తున్న బ్రహ్మానందం ఎక్కువగా పెన్సిల్ తో స్కెచ్ లు రూపొందిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం మదర్ థెరిస్సా స్కెచ్ గీసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అయోధ్య లో రామ మందిరం భూమి పూజ సందర్భంగా ఆంజనేయుడి ఆనంద భాష్పాలు అంటూ శ్రీరాముడిని ఆలింగనం చేసుకొని ఆంజనేయుడు తన్మయత్వం తో కన్నీరు కారుస్తున్న అద్భుత స్కెచ్ ను బ్రహ్మానందం వేశారు. ఆ స్కెచ్ ప్రేక్షలకులను విశేషంగా ఆకట్టుకుంది. బ్రహ్మానందం ప్రస్తుతం “రంగమార్తాండ “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 13 =