సూపర్ హిట్ అయిన సినిమాలను ఈ మధ్య సీక్వెల్స్ చేయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవల వచ్చే హిట్ సినిమాలకు సీక్వెల్స్ అంటే ఓకే కానీ ఒకప్పుడు హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ అంటే ఇప్పుడు కష్టమే. ఇప్పుడు అలాంటి ఒక సినిమానే సీక్వెల్ తీస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అది కూడా ఒకటి కాదు రెండు కాదు 42 ఏళ్ళ తర్వాత.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
భారతీరాజా దర్శకత్వంలో విలక్షణ నటుడు కమలహాసన్, శ్రీదేవి జంటగా 1978లో వచ్చిన సినిమా సిగప్పు రోజాక్కళ్. తెలుగులో ఈ సినిమాను ఎర్ర గులాబీలు అంటే టైటిల్ తో డబ్ చేసి రిలీజ్ చేశారు. సైకో థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేసే అబ్బాయిలను ఒక యువతి ప్రతీకారం తీర్చుకోడమే ఈ సినిమా కథ. ఇక ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తీయాలన్న ప్లాన్ లో ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెల్ లో మహానటి సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ ను తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకు భారతీరాజా కుమారుడు మనోజ్ దర్శకత్వం వహిస్తుండగా.. భారతీరాజానే సొంతంగా నిర్మించనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే మాత్రం కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ మంచి ఆఫర్స్ తో దూసుకుపోతుంది. ఇటీవలే పెంగ్విన్ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లు రిలీజ్ కావాల్సి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: