పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు త్వరలో సీక్వెల్ రాబోతున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయాన్ని స్యయంగా దర్శకుడు, హీరో అయిన రాఘవ లారెన్స్ ఇటీవలే ప్రకటించాడు కూడా. ఇక అప్పటినుండి చంద్రముఖి 2 పై రూమర్లు వస్తూనే ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ మూవీలో చంద్రముఖి పాత్రలో నటించే లీడ్ యాక్ట్రెస్ పై పలువురి పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట చంద్రముఖిలో నటించిన జ్యోతికనే నటిస్తుంది అన్నారు. సీక్వెల్ లో నటించమని తనను ఎవరూ అడగలేదని జ్యోతిక క్లారిటీ ఇచ్చేసింది. ఆ తర్వాత సిమ్రాన్ పేరు వినిపించింది. ఇక ఇటీవల అయితే ఏకంగా కియారా అద్వాని నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి.
ఇక ఈ వార్తలపై లారెన్స్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. తన ట్విట్టర్ లో.. చంద్రముఖి-2లో నటి ఎవరనే విషయంలో అనేక పుకార్లు మీడియాలో వస్తున్నాయి… జ్యోతిక మేడమ్, సిమ్రాన్ మేడమ్, కియారా అద్వానీ నటిస్తారని వస్తున్న వార్తలన్నీ అబద్ధం. అవన్నీ ఫేక్ న్యూస్… ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి… పరిస్థితులు చక్కబడిన తర్వాత ప్రొడక్షన్ టీం ఆ వివరాలు వెల్లడిస్తుంది. లీడ్ క్యారెక్టర్ ఎవరనేది తామే అధికారికంగా ప్రకటిస్తామని లారెన్స్ తెలిపాడు. మరి ఇప్పటికైనా ఈ రూమర్స్ కు బ్రేక్ పడుతుందేమో చూద్దాం.
Chandramukhi 2 pic.twitter.com/sArxsvp3XN
— Raghava Lawrence (@offl_Lawrence) August 1, 2020
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: