అభిషేక్ ఆగ్వాల్ ఆర్ట్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై సీనియర్ దర్శకుడు తేజ దర్శకత్వంలో యాక్షన్ హీరో గోపీచంద్ కథానాయకుడి గా “అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో ఇద్దరు కథానాయికలు ఉన్నారు. ఒక కథానాయిక గా కీర్తి సురేష్ ఎంపిక అయ్యారు. మరో కథానాయికగా కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేయాలని దర్శకుడు తేజ ప్లాన్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ తనయ కళ్యాణి ప్రియదర్శన్ “హలో ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించారు. “చిత్ర లహరి “, “రణరంగం “మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కళ్యాణి ప్రస్తుతం తమిళ , మలయాళ భాషల మూవీస్ తో బిజీగా ఉన్నారు. “అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీ సెప్టెంబర్ లో సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం. హీరో గోపీచంద్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో కబడ్డీ నేపథ్యం లో రూపొందుతున్న స్పోర్ట్స్ డ్రామా “సీటీ మార్ ” మూవీ లో నటిస్తున్నారు. కరోనా కారణం గా ఈమూవీ షూటింగ్ వాయిదా పడింది. “సీటీ మార్ “, “అలిమేలు మంగ వెంకట రమణ ” మూవీస్ షూటింగ్స్ ఏక కాలంలో జరిగేలా గోపీచంద్ ప్లాన్ చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: