వచ్చేనెలలో రానా-మిహికా ల వివాహం జరగనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈ నేపథ్యంలో ఇప్పటినుండే పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు ఇరు కుటుంబసభ్యులు. తన ప్రేమను పరిచయం చేసిన దగ్గర నుండి అన్ని పనులు చక చక జరిగిపోయాయి. ఎంగేజ్ మెంట్ అవ్వడం పెళ్లి ముహూర్తం అన్ని పెట్టుకోవడం వెంట వెంటనే జరిగిపోయాయి. ఆగస్టు 8న వీరి వివాహానికి ముహూర్తం ఖరారు చేసిన సంగతి తెలిసిందే. తాజ్ ఫలక్ నుమా ప్యాలెస్ లో వీరి వివాహం జరగనుంది. ప్రభుత్య నిబంధనలను దృష్టిలో పెట్టుకొని.. కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో పెళ్లి చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం రానా-మిహికా ల పెళ్ళిలో చాలా ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తుంది. వీరి వివాహం కోసం ఫలక్ నుమా హోటల్ ను మూడు రోజులు బుక్ చేశారట. పెళ్లికి వచ్చే అతిధులు తప్పా ఇంకెవరూ మూడు రోజులపాటు వేరేవాళ్లకి హోటల్లోకి ఎంట్రీ లేదంట.
పెళ్ళిలో వంటల కోసం కంట్రీలోనే టాప్ చెఫ్స్ ను సెలెక్ట్ చేశారట. హైదరాబాదీ వంటకాలతో పాటు .. మార్వారి వంటలను కూడా చేయనున్నారట.
ఇక మిహికా ఫ్యాషన్ డిజైనర్ అని తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన కొంతమంది టాప్ డిజైనర్స్ కూడా వీరి పెళ్ళికి హాజరుకానున్నారట.
ఇక రానా సినిమాల విషయానికి వచ్చేసరికి.. ప్రస్తుతం రానా అరణ్య అనే ఓ సినిమాలో నటిస్తున్నాడు. విడుదలకి సిద్దంగా ఉన్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక ఈ సినిమాతో పాటుగా విరాటపర్వం అనే సినిమాని చేస్తున్నాడు రానా.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: