6ఏళ్ల సినీ ప్రయాణం – పట్టుదల, ఆత్మవిశ్వాసమే అతని బలం..!

Bellamkonda Sai Sreenivas Completes 6 Years Of His Film Career In Tollywood

ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం అనేది కామన్. కానీ వారి సినీ కెరీర్ మాత్రం తమలోని నటన.. సినిమాలను ఎంచుకునే విధానం పై ఆధారపడి ఉంటుంది. ఇక స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను తెరకెక్కించిన బెల్లంకొండ తనయుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కూడా తనను తాను కొత్త కొత్త పాత్రలతో.. కొత్తగా ఆవిష్కరించుకోడానికి ప్రయత్నిస్తూనే వున్నాడు. ఆ హైట్.. పర్సనాలిటీ.. ఫిట్ నెస్ హీరోకు కావాల్సిన అన్ని లక్షణాలు సాయి శ్రీనివాస్ కు ఉండటంతో.. తండ్రి సహకారంతో వెండితెరపై అడుగుపెట్టాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అ‍ల్లుడు శ్రీను సినిమాతో వెండితెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ తొలి చిత్రంతోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తొలి సినిమాతోనే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ సినిమా ఈరోజుతో 6ఏళ్ళు పూర్తి చేసుకుంది. అంతేకాదు సాయి శ్రీనివాస్ తెలుగు తెరకు పరిచయమై కూడా 6ఏళ్ళు అవుతుంది.

ఇక ఈ 6ఏళ్ళల్లో సాయి శ్రీనివాస్ తనకు వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు. భీమనేని శ్రీనివాస్‌రావు దర్శకత్వంలో ‘స్పీడున్నోడు’ చిత్రం చేసి కుటుంబ ప్రేక్షకులను మెప్పించారు. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన ‘జయ జానకి నాయక’ చిత్రంతో మాస్ ప్రేక్షకులను అలరించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆ సినిమా అనంతరం శ్రీవాస్ దర్శకత్వంలో ‘సాక్షం’ వంటి వైవిధ్యమైన చిత్రంతో ఆకట్టుకున్నారు. ఇటీవల విడుదలైన ‘కవచం’లో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా, సీత సినిమాలో అమాయకుడి పాత్రలో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించాడు. అయితే సరైన విజయం మాత్రం అందుకోలేకపోయాడు. కానీ ఎక్కడా నిరాశ చెందకుండా మొక్కవోని దీక్షవోలె తన ప్రయత్నం తాను చేసుకుంటూ.. ఎలాగైనా సరే హిట్ కొట్టాలన్న కసితోనే తన ప్రయత్నాన్ని మాత్రం విరమించలేదు. ఫైనల్ గా అతడు ప్రధాన పాత్రలో నటించిన ప్రయోగాత్మక చిత్రం ‘రాక్షసుడు’ హిట్‌ కావడంతో తిరిగి సక్సెస్‌ బాట పట్టాడు. ఈ సినిమా సక్సెస్ తో ఇప్పుడు చాలా జాగ్రత్తగా సినిమాలు ఎంచుకునే పనిలో పడ్డాడు సాయి శ్రీనివాస్.

ప్రస్తుతం సాయి శ్రీనివాస్ ‘కందిరీగ’, ‘హైపర్‌’ చిత్రాల దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో ‘అల్లుడు అదుర్స్‌’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇస్మార్ట్‌ హీరోయిన్‌ నభా నటేష్‌, అనూ ఇమ్మాన్యుయేల్‌ హీరోతో జోడీ కడుతున్నారు. సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌పై జి. సుబ్రహ్మణ్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు… దేవిశ్రీప్రసాద్‌ సంగీతమందిస్తున్నాడు.

మరి ఇదే పట్టుదలతో వరుస సినిమాలు చేసుకుంటూ సాయి శ్రీనివాస్ ఇలానే కెరీర్ లో దూసుకుపోవాలని.. ఎన్నో విజయాలను దక్కించుకోవాలని కోరుకుందాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − three =