బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ బ్లాక్ బస్టర్ “భరత్ అనే నేను ” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన “వినయ విధేయ రామ ” మూవీ ప్రేక్షకాదరణ పొందలేదు. ఆ మూవీ తరువాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కియారా నటించిన “కబీర్ సింగ్ “హిందీ మూవీ ఘనవిజయం సాధించింది. తెలుగు సూపర్ హిట్ ” అర్జున్ రెడ్డి ” హిందీ రీమేక్ గా రూపొందిన “కబీర్ సింగ్ ” మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“కబీర్ సింగ్ ” మూవీ ఘనవిజయం తో కియారా అద్వానీ బాలీవుడ్ లో బిజీగా మారారు. కియారా ప్రస్తుతం 4 హిందీ మూవీస్ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన కియారా అద్వానీ తన జిమ్ , యోగా , తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రీసెంట్ గా కియారా తన పూల్ సైడ్ ఫొటో ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. స్టన్నింగ్ లుక్ తో ఉన్న ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ లో కియారా నటించే అవకాశం ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: