అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా ఎంత ఘన విజయం సాధించిందో చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలైన సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు అభినయం క్లాస్, మాస్ ఆడియన్స్ అందరినీ ఆకట్టుకుంది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరేదు. మహేష్ బాబు కెరీర్లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక గత ఏడాది ఇదే రోజున ఈ సినిమా ప్రారంభమై ఆరు నెలల్లో రిలీజ్ అయింది. ఇదే విషయాన్ని అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా గుర్తుచేసుకున్నారు. జూలై 5, లాస్ట్ ఇయర్(2019) ఇదే రోజు మహేష్ బాబుగారితో ‘యాక్షన్’ అంటూ ‘సరిలేరు నీకెవ్వరు’ షూటింగ్ మొదలెట్టాం. ఆ రోజు షూటింగ్ మొదలెట్టి 6 నెలల్లో సినిమాని రిలీజ్ చేశాం. ఈ 6 నెలల్లో ‘బొమ్మ మొదలైంది’ టు ‘బొమ్మ దద్దరిల్లిపోయింది’. ఈ సందర్భంగా నాకు ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు నా టీమ్కు, అభిమానులకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ’’ అని అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ లోకేషన్ స్టిల్ షేర్ చేశారు.
July 5th – Last year this day started with saying “ACTION” to Superstar @Urstrulymahesh garu. Started shoot on this day and release in 6 months. “బొమ్మ మొదలైంది” to “బొమ్మ దద్దరిల్లిపోయింది” in 6 months. Thanks to my team and audience for this great experience#SarileruNeekevvaru pic.twitter.com/ag7SBEyhkw
— Anil Ravipudi (@AnilRavipudi) July 5, 2020
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 సీక్వెల్ స్క్రిప్ట్ లో బిజీ గా వున్నాడు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. ప్రస్తుతం అనిల్ రావిపూడి ఆ స్క్రిప్ట్ పనుల్లోనే బిజీగా వున్నాడు. అయితే ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నాడు. ప్రస్తుతం కరోనా కాబట్టి ఇప్పట్లో సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ లేదు. మరో వైపు మహేష్ పరుశురాంతో సినిమా చేయనున్నాడు. పరిస్థితులు చెక్కబడిన తర్వాతే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: