‘వైద్యో నారాయణో హరి’.. అంటే వైద్యుడు దేవుడితో సమానం అని అర్ధం. ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్పై వైద్యులే ముందుండి పోరాటం చేసి ప్రజల ప్రాణాల్ని కాపాడుతన్నారు. వారే కనుక లేకపోయిఉంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవడం కూడా కష్టమే. ఇక నిన్న జాతీయ వైద్యుల దినోత్సవం. ఈ నేపథ్యంలో.. డాక్టర్స్ డే సందర్భంగా జెనీలియా, రితేష్ లు కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేంటంటే… తమ అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో జెనీలియా ఒక వీడియోను పోస్ట్ చేశారు.
‘‘దీని గురించి రితేష్, నేను చాలా కాలంగా ఆలోచిస్తున్నాం. దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయాం. ఈరోజు డాక్టర్స్ డేను పురష్కరించుకుని మా అవయవాలను దానం చేస్తున్నట్టు ప్రతిజ్ఞ చేస్తున్నాం. ఈ విషయంలో మాలో స్ఫూర్తినింపిన డాక్టర్ నోజర్ షెరీర్, FOGSIకి ధన్యవాదాలు. మరొకరికి జీవితాన్ని బహుమతిగా ఇవ్వడం కన్నా గొప్ప బహుమతి మరొకటి ఉండదు. ప్రతి ఒక్కరూ అవయవాలను దానం చేయాలని, జీవితాలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని జెనీలియా, రితేష్ వెల్లడించారు. మరి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ఈ దంపతులను అభినందించకుండా ఉండలేం కదా.




Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.