“నీ మనసు నాకు తెలుసు ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన తమిళ హీరోయిన్ త్రిష తమిళ , తెలుగు సూపర్ హిట్ మూవీస్ తో 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తున్నారు. త్రిష హీరోయిన్ గా నటించిన “వర్షం “, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “ఆడవారిమాటలకు అర్ధాలే వేరులే ” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఆ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరోయిన్ త్రిష ప్రస్తుతం 5 తమిళ మూవీస్, ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన త్రిష దర్శకుడు గౌతమ్ మీనన్ సహకారంతో “కార్తీ డయల్ సేత్త ఏన్ “షార్ట్ ఫిల్మ్ లో నటించారు. త్రిష ఇప్పుడు న్యూ లుక్ తో ప్రేక్షక , అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. టీనేజ్ అమ్మాయిలా త్రిష మేకోవర్ ప్రేక్షకులను షాక్ కు గురిచేసింది. దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన “విన్నై తాండి వరువాయా “(ఏ మాయ చేసావె ) మూవీ ఘనవిజయం సాధించింది. ఇప్పుడు ఆమూవీ సీక్వెల్ ను హీరో శింబు , త్రిష లతో తెరకెక్కించాలని గౌతమ్ మీనన్ ప్లాన్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: