లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సోషల్ డిస్టెన్స్ మెయిన్ టైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సోషల్ మీడియాకు మాత్రం దగ్గరగానే ఉంటూ అభిమానులకు మాత్రం అందుబాటులోనే వుంటున్నారు. ఇక ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించగా.. తాజాగా సుశాంత్ కూడా తన అభిమానులతో ముచ్చటించి పలు విషయాలు పంచుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాను నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా థ్రిల్లర్ సినిమా అని చెప్పాడు. అంతేకాదు కథ నచ్చితే కనుక విలన్ పాత్రలు చేయడానికి కూడా తను రెడీ అని క్లారిటీ ఇచ్చేశాడు. ఇంకా సమంత-చైతన్యలు చాలా క్రమశిక్షణగా ఉంటారని.. వారి దగ్గర నుండి అదే నేర్చుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు.
‘చి.ల.సౌ’ సినిమా తర్వాత సుశాంత్ చాలా గ్యాప్ తీసుకున్నాడు. మధ్యలో అల వైకుంఠపురములో సినిమాలో ఒక కీలక పాత్రలో నటించాడు. ఇక లాంగ్ గ్యాప్ తర్వాత ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ అనే సినిమాతో ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. S. దర్శన్ దర్శకత్వంలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను A1స్టూడియోస్, శాస్త్ర మూవీస్ బ్యానర్స్ పై నిర్మిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: