తెలుగు , తమిళ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం హిందీ , తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి ఇంటికే పరిమితం అయిన రకుల్ ఫుడ్ , వర్కౌట్స్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ టైమ్ పాస్ చేస్తున్నారు. షూటింగ్స్ ప్రారంభానికై ఆసక్తి తో ఎదురు చూస్తున్న రకుల్ ఒక హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎమ్మాయ్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై కాశ్వీ నాయర్ దర్శకత్వంలో అర్జున్ కపూర్ హీరోగా “ఛలే ఛలో ” హిందీ మూవీ రూపొందుతుంది. ఈ మూవీ లో రకుల్ కథానాయిక. ఇప్పటికే అధిక శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఫైనల్ షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ యూరోప్ లో ప్లాన్ చేసింది. కరోనా ఎఫెక్ట్ కారణం గా యూరోప్ లో షూటింగ్ కు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ముంబై లో చిత్రీకరణ జరపాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయింది. త్వరలోనే ప్రారంభం కానున్న “ఛలే ఛలో ” హిందీ మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి రకుల్ ఢిల్లీ నుండి ముంబై కి ప్రయాణం కానున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: