లాక్ డౌన్ లో సడలింపులు చేసిన తర్వాత రోజు రోజుకు కరోనా కేసులు పెరుతున్న సంగతి తెలిసిందే. మునుపటికంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇక ఈ నేపథ్యంలో ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీస్ పిలుపు నివ్వగా ఇప్పుడు తాజాగా కింగ్ నాగార్జున కూడా పలు సూచనలు చేశారు. తన ట్విట్టర్ ఖాతా ద్వారా కరోనా సమర్థవంతంగా ఎదుర్కొవాలంటే మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండటమే ప్రతి ఒక్కరికి ప్రధాన అయుధమని వివరించారు. మా ఫ్రెండ్ శిల్పా రెడ్డి, ఆమె భర్త కరోనా బారిన పడ్డారని, అయితే వారు కరోనా విజయవంతంగా జయించారిన వెల్లడించారు. అంతేకాదు శిల్పా రెడ్డి వీడియో ఒకటి షేర్ చేశారు నాగార్జున. ఆ వీడియోలో శిల్పా రెడ్డి కొన్ని ఆసక్తికర విషయాలు, ఆమె అనుభవాలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
As the cases of #COVID__19 increase in the world,The only weapon right now seems to be being healthy in mind & body.Our dear friend #Shilpareddy and her husband experienced the virus and came out of it shining!!👍💐 Listen to her experience..inspiring!!🙏 https://t.co/mqRmuLQYlM
— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 25, 2020
కాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ శిల్పారెడ్డికి ఇటీవల కరోనా బారిన పడినట్టు చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. తనకు, తన భర్తకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిందని.. అయినప్పటికీ తమలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని శిల్పారెడ్డి ఇన్స్టాగ్రామ్లో వెల్లడించారు. తగిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, డైట్ పాటిస్తే కరోనా నుంచి బయటపడవచ్చని చెబుతూ ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఇంట్లోనే ప్రకృతి సిద్ధమైన చికిత్సను ఎలా తీసుకోవచ్చో వివరించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: