తెలుగు , తమిళ , హిందీ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ కరోనా లాక్ డౌన్ సమయంలో ముంబై లో ఇంటికి పరిమితం అయ్యారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉన్నారు. దాదాపు 3నెలల తరువాత గురుగావ్ లోని తన స్వంత ఇంటికి రకుల్ చేరుకున్నారు. ప్రస్తుతం తల్లిదండ్రులతో టైమ్ స్పెండ్ చేస్తున్న రకుల్ ఆనందం ఆమె మాటల్లోనే తెలుసుకుందాం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
రకుల్ ప్రీత్ మాట్లాడుతూ .. దాదాపు 9 సంవత్సరాల క్రితం జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకోవాలనే కలలతో తన ప్రయాణాన్ని ప్రారంభించానని, అనేక కష్టాలు , అవరోధాలు అధిగమించి ఈ స్థాయి కి చేరుకున్నానని , సినిమాలలో నటిస్తూ బిజీ లైఫ్ కారణం గా స్వంత ఇంటిలో ఉండే అవకాశం ఒకటి లేదా రెండు రోజులకు మించి ఉండేది కాదని , చాలా సంవత్సరాల తరువాత ఎటువంటి ప్లాన్స్ , ఎజెండా లేకుండా తల్లిదండ్రులతో సంతోషంగా టైమ్ స్పెండ్ చేస్తున్నానని , వర్క్ అవుట్స్ , టీవీ చూస్తూ , తల్లిదండ్రులతో కబుర్లు చెప్పడం , ఇష్టమైన వంటకాలు తినడం ఒక కొత్త అనుభూతినిస్తుందని , మళ్ళీ బాల్యం లోకి అడుగుపెట్టినట్టుగా ఉందని రకుల్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. రకుల్ ప్రస్తుతం రెండు హిందీ , రెండు తమిళ , ఒక తెలుగు మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: