లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తన అభిమానులతో సరదాగా మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికరవిషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘అభిమానుల గురించి ఒక్కమాట చెప్పండి? ‘ అని అడగగా. ‘నా ఆక్సిజన్ నా అభిమానులు... సక్సెస్ లో ఉన్నా.. లేకపోయినా నాకు ఎప్పుడూ అండగా ఉంటూనే ఉన్నారు.. వారికి నా ధన్యవాదాలు’ అని తెలిపాడు. ఇక వాటితో పాటు మరిన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే మరో అభిమాని ‘మీ మిత్రుడు ఎవరు?’ అని అడగగా ‘దర్శకుడు చందూ మొండేటి‘ అని చెప్పారు. మీకు ఇష్టమైన వెబ్ సిరీస్? అని అడగగా.. ‘నాకు గేమ్స్ ఆఫ్ థ్రోన్స్’ అంటే బాగా ఇష్టం అని తెలిపారు. మరి మీకిష్టమైన నటి ? అంటే.. ‘భూమిక అని నిఖిల్ చెప్పుకొచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం నిఖిల్ రెండు మూడు ప్రాజెక్ట్స్ తో బిజీ గా ఉన్నాడు. చందూ మెుండేటి కాంబినేషన్ లో వచ్చిన ‘కార్తికేయ2′ సినిమా తెరకెక్కబోతోంది. ఉగాది నుండి షూటింగ్ మొదలవ్వాలి కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ అయింది. ఇక ఈ హడావుడి కాస్త తగ్గితే అప్పుడు ఈ సినిమా షూటింగ్ ప్రారంభిస్తారు. కాగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం పై నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్నారు. మరి చూద్దాం కార్తికేయ2 ఎంత వరకూ సక్సెస్ అవుతుందో.
దీనితో పాటు కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పనులు కూడా జరుగుతున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: