ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఆగ్రా సిటీ లో యమునా నది ఒడ్డున నిర్మించిన తాజ్ మహల్ 1632 సంవత్సరం లో నిర్మాణం ప్రారంభమై 1648 సంవత్సరంలో పూర్తయింది. మొఘల్ సంస్థాన రాజు షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం నిర్మించిన తాజ్ మహల్ ఒక అద్భుత కట్టడంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. న్యూ సెవెన్ వండర్స్ ఆఫ్ వరల్డ్ గా డిక్లేర్ చేయబడిన తాజ్ మహల్ ప్రతీ రోజూ వేలాది సందర్శకులతో విరాజిల్లుతుంది. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన కుటుంబ సభ్యులతో తాజ్ మహల్ ను సందర్శించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజ్ మహల్ ను ఫస్ట్ టైమ్ సందర్శించినప్పుడు మంత్ర ముగ్దురాలినయ్యానని, తాజ్ మహల్ గురించి విన్నదానికంటే చూసి చాలా ఇంప్రెస్ అయ్యానని, ఇది ఒక అద్భుత అనుభవం అని, తాజ్ మహల్ కళా వైభవం తన మనసు లో చెరగని ముద్ర వేసిందని , వండర్ ఆఫ్ ది వరల్డ్ తాజ్ మహల్ అంటూ తన కుటుంబ సభ్యులతో ఉన్న ఫొటోస్ ను కాజల్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ ప్రస్తుతం “ఆచార్య “, “మోసగాళ్ళు “, “ఇండియన్ 2”, “ముంబై సాగ” మూవీస్ లో నటిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: