అక్కినేని ఫ్యామిలీ కి మనం అనే సూపర్ హిట్ సినిమాను అందించాడు విక్రమ్ కుమార్. ఇక మనం తర్వాత చైతు తో మరోసారి సినిమా చేయడానికి రెడీ అయిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడే ఈ సినిమాపై రూమర్లు మొదలైన సంగతి కూడా విదితమే. సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే పలు వార్తలు వచ్చాయి. ఆ సినిమా విక్రమ్ మొదటి సినిమా 13Bకి సీక్వెల్ అనే టాక్ కూడా వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఈ వార్తలకు క్లారిటీ ఇచ్చారు విక్రమ్ కుమార్. చైతుతో తన చిత్రం హర్రర్ థ్రిల్లర్ కాదని, ఇది రొమాన్స్ మరియు కామెడీ కలయికలో రానున్న ఆరోగ్యకరమైన ఫుల్ ఎంటర్టైనర్ అని ఆయన అన్నారు. లాక్ డౌన్ ముగిసిన వెంటనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్ళనుందని తెలిపారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్రాజు నిర్మించనున్నారు.
కాగా ప్రస్తుతం శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ‘లవ్స్టోరీ’ చేస్తున్నారు నాగచైతన్య. ఇది కంప్లీట్ అయిన తర్వాత ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. కానీ ఆ సినిమా రావడానికి చాలా సమయం పడుతుంది. ఎందుకంటే పరశురామ్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట సినిమా చేయనున్నాడు. అయితే ఈ గ్యాప్ లో నాగ చైతన్య మనం దర్శకుడు విక్రమ్ కుమార్ తో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
నాగచైతన్య ఇటీవల కాలంలో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ .. విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంటూ వెళుతున్నాడు. ‘వెంకీమామ’, ‘మజిలీ’ సినిమాలతో హిట్లతో మంచి ఫామ్ లో ఉన్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: