హీరోలు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి..!

Star Heroes Should Reduce Their Renumeration To Help Film Industry In These Tough Times Says Veteran Director Mani Ratnam
Star Heroes Should Reduce Their Renumeration To Help Film Industry In These Tough Times Says Veteran Director Mani Ratnam

కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోయాయి. సినిమా రిలీజ్ లు ఆగిపోయాయి. దీనితో నిర్మాతలు కాస్త ఇరకాటంలో పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదో లాగ షూటింగ్ లు పూర్తి చేసి సినిమాలు రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే పరిస్థితులను అర్థంచేసుకోవాలని అన్నారు మణిరత్నం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మణిరత్నం ప్రస్తుత పరిస్థితులపై మాట్లాడుతూ.. ‘‘థియేట్రికల్‌ బిజినెస్‌ రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో తెలియదు. ఇండస్ట్రీ తిరిగి సరైన మార్గంలోకి వచ్చేంత వరకు స్టార్‌ హీరోలు, పెద్ద టెక్నీషియన్లు వారి పారితోషికాలను తగ్గించుకోవాలి. అప్పుడే ఇండస్ట్రీకి మేలు జరుగుతుంది’’ అని అన్నారు. మరి ఇప్పటికే కొంతమంది హీరోలు పారితోషికాలు తగ్గించుకున్నారు. మరి చూద్దాం ఇంకెంత మంది హీరోలు ముందుకొస్తారో.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం మణిరత్నం ‘పొన్నియన్‌ సెల్వన్‌’ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కించనున్నారు. ఇంకా ఈ సినిమాలో అనుష్క, జయం రవి, విక్రమ్, కీర్తి సురేష్, విజయ్ సేతుపతి, కార్తి, ఐశ్వర్య లక్ష్మి, మోహన్ బాబు లాంటి స్టార్లు నటించనున్నారు. మలయాళ నటుడు జయరాం, నటి అమలాపాల్, ఐశ్వర్యలక్ష్మి కూడా ముఖ్య పాత్రల్లో నటించనున్నట్లు తెలిసింది. మద్రాస్‌ టాకీస్, లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − five =