యువ కథానాయకుడు సుధీర్ బాబుకి అచ్చొచ్చిన దర్శకుల్లో ఇంద్రగంటి మోహనకృష్ణ ఒకరు. వీరిద్దరి కలయికలో రూపొందిన ‘సమ్మోహనం’(2018) కుటుంబ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కట్ చేస్తే.. స్వల్ప విరామం తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో చిత్రం రాబోతోంది. ఆ చిత్రమే ‘వి’. ఉగాదికి విడుదల కావాల్సిన ఈ యాక్షన్ థ్రిల్లర్ కరోనా ఎఫెక్ట్ తో వాయిదా పడింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. తాజాగా ‘వి’ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు సుధీర్. ‘వి’లో తను పోలీస్ అధికారిగా కనిపిస్తానని, మోహనకృష్ణ సినిమా అంటే రచనకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని తెలిపాడు. అలాగే, యాక్షన్ జానరే అయినా చక్కటి డ్రామా కూడా ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇంకా.. నానికి, తనకు మధ్య సంభాషణలు, సవాళ్ళు ఆకట్టుకుంటాయని తెలిపాడు.
మరి.. సుధీర్ కెరీర్ లో మరో మెమరబుల్ మూవీగా ‘వి’ నిలుస్తుందేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: