లాక్ డౌన్ వల్ల థియేటర్లు మూతపడ్డాయి. ఒకవేళ లాక్ డౌన్ తీసేసినా థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయో అన్న విషయంపై క్లారిటీ లేదు. ఈ ఏడాది చివరికి ఏమన్నా తెరుచుకోవచ్చేమో అన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో కొంతమంది సినిమాలను ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాలను ఆన్లైన్ లో విడుదల చేసేసారు. తెలుగులో ఇప్పటికే ‘అమృతరామమ్’ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాగా, తమిళంలో జ్యోతిక లీడ్ రోల్ లో నటించిన ‘పొన్మగల్ వందాల్’ సినిమా, హిందీ చిత్రం లక్ష్మీ బాంబ్ కూడా ఓటీటీలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇప్పుడు తాజాగా మరో సినిమాకూడా రిలీజ్ కు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వంలో కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో ‘పెంగ్విన్’ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగు, తమిళ్ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. అయితే కరోనా వల్ల రిలీజ్ లన్నీ ఆగిపోయాయి. దీనితో ఆన్లైన్ లోనే రిలీజ్ చేయాలని.. తమిళం, తెలుగు వెర్షన్లను ఒకేసారి రిలీజ్ చేయడానికి అమెజాన్ ప్రైమ్ తో నిర్మాతలు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుస్తుంది. జూన్ 19వ తేదీన ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది. ఇంకా మరెన్ని సినిమాలు ఆన్లైన్ లో రిలీజ్ కు సిద్దమవుతాయో చూద్దాం..
How far will she go? Find out on 19th June! #PenguinOnPrime #WorldPremiereOnPrime @PrimeVideoIN @KeerthyOfficial @karthiksubbaraj @EashvarKarthic @Music_Santhosh @kaarthekeyens @Sudhans2017 @Stonebenchfilms @PassionStudios_ pic.twitter.com/J4sPfdr5gG
— Telugu FilmNagar (@telugufilmnagar) May 15, 2020
ఈ సినిమాతో పాటు నరేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో ‘మిస్ ఇండియా’.. అమిత్ శర్మ దర్శకత్వంలో ‘మైదాన్’ సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో ‘గుడ్ లక్ సఖి’ లో నటిస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: