టాలీవుడ్ కో ఎంతోమంది డైరెక్టర్స్ ఉన్నారు.. చిరు సెకండ్ ఇన్నింగ్స్ లో తనతో సినిమా చేయడానికి పోటీ పడుతున్నారు.. అయితే వారందరినీ పక్కన పెట్టి ‘లూసిఫర్’ భాద్యతలు సాహో డైరెక్టర్ సుజీత్ కు ఇవ్వడంపై అందరూ ఆశ్చర్య పోయారు. అయితే తనపై ఆ నమ్మకం ఉందని చిరు అప్పుడే చెప్పాడు. ఇక చిరుకు సుజీత్ పై అంత నమ్మకం కలగడానికి గల కారణం సాహో సినిమానేనట. దాదాపు 400 కోట్ల బడ్జెట్.. పాన్ ఇండియా ఇండియా.. ప్రభాస్, శ్రద్దా కపూర్, నీల్ నితిన్ ముఖేష్, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్ ఇంకా చాలా మంది పెద్ద పెద్ద నటీ నటులే ఈ సినిమాలో నటించగా.. వారిని హ్యాండిల్ చేసిన విధానం ఇవి చిరు కు బాగా నచ్చాయట. దీనితో లూసిఫర్ భాద్యతలు కావాలని సుజీత్ కు అప్పగించారట. ఎందుకంటే ఈ సినిమాలో కూడా కాస్టింగ్ కాస్త పెద్దదిగానే ఉంటుంది. సుజీత్ అయితే బాగా హ్యాండిల్ చేయగలడు. ప్రస్తుతం సుజీత్ స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నాడు. తెలుగుకు తగిన విధంగా కొన్ని మార్పులు చేసే పనిలో ఉన్నాడట. ప్రస్తుతం చిరు కొరటాలతో ఆచార్య సినిమాతో బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా అయిపోయిన వెంటనే ‘లూసిఫర్’ రీమేక్ సెట్స్ పైకి వెళ్లనుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: