కుటుంబకథా చిత్రాల కథానాయకుడు జగపతిబాబు కెరీర్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చిత్రాల్లో ‘మనోహరం’ ఒకటి. టాలెంటెడ్ డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కించిన ఈ పాట్రియాటిక్ డ్రామాలో జగపతిబాబుకి జోడిగా లయ నటించింది. ప్రకాష్రాజ్, బ్రహ్మాజీ, సూర్య, ముకేష్ రిషి, చంద్రమోహన్, మల్లికార్జున రావు, యం.ఎస్.నారాయణ, యల్.బి.శ్రీరాం, బెనర్జీ, ఝాన్సీ, వినోద్ బాల ముఖ్య భూమికలు పోషించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి వేటూరి సుందరరామమూర్తి సాహిత్యం సమకూర్చగా “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ వీనులవిందైన బాణీలు అందించాడు. “గుప్పెడు గుండెల”, “పుచ్చా పువ్వుల”, “చూడ చక్కని”, “సరి సరి నటనల”, “మంగళగౌరికి”, “భారతమాత భగవద్గీత”.. ఇలా ఇందులోని పాటలన్నీ ప్రేక్షకాదరణ పొందాయి. మాగంటి బాబు సమర్పణలో యం.ఆర్.సి. అండ్ మెలోడి కంబైన్స్ పతాకంపై సుంకర మధుమురళి, ముళ్ళపూడి బ్రహ్మానందం ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించారు. 2000 మే 13న విడుదలై విమర్శకులు ప్రశంసలు పొందిన ‘మనోహరం’.. నేటితో 20 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.
‘మనోహరం’ – కొన్ని విశేషాలు:
* జగపతిబాబు, లయ తొలిసారి జంటగా నటించిన చిత్రమిది.
* జగపతిబాబు, గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఏకైక చిత్రం ‘మనోహరం’.
* జగపతిబాబు హీరోగా మణిశర్మ స్వరకల్పనలో రూపొందిన తొలి చిత్రమిది.
* ఈ సినిమాతో జగపతిబాబు తన కెరీర్లో రెండోసారి ‘ఉత్తమ నటుడు’గా ‘నంది’ పురస్కారాన్ని కైవసం చేసుకోవడం విశేషం. అంతకుముందు ‘మావిచిగురు’(1996) చిత్రానికిగానూ ‘బెస్ట్ యాక్టర్’ కేటగిరీలో ‘నంది’ అవార్డును సొంతం చేసుకున్నాడు.
* ఈ చిత్రంతో లయ ‘ఉత్తమ నటి’ విభాగంలో తన కెరీర్లో తొలిసారి ‘నంది’ని కైవసం చేసుకుంది. అనంతరం ‘ప్రేమించు’(2001) చిత్రంతో మరోసారి ‘నంది’ని కైవసం చేసుకుంది.
* ‘ఉత్తమ తృతీయ చిత్రం’గా 2000గానూ ‘నంది’ పురస్కారాన్ని గెలుచుకుంది ‘మనోహరం’.
* బెస్ట్ ఎడిటర్గా పలు నేషనల్ అవార్డ్స్ను తన ఖాతాలో వేసుకున్న టాలెంటెడ్ టెక్నీషియన్ ఎ.శ్రీకరప్రసాద్.. తన కెరీర్లో తొలిసారి ‘నంది’ని కైవసం చేసుకోవడం ఈ చిత్రంతోనే కావడం విశేషం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: