లాక్ డౌన్ వల్ల యంగ్ హీరో నిఖిల్ వివాహం వాయిదా పడిన సంగతి తెలిసిందే. పల్లవి వర్మ అనే డాక్టర్ తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్ పెద్దల అంగీకారంతో ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్నారు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగాలి. లాక్ డౌన్ అయినా గుడిలో పెళ్లి చేసుకుంటా అని గతంలో చెప్పాడు. అయితే ఆ తర్వాత మళ్ళీ వాయిదా వేశారు. ఇక ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడటంతో తాజాగా పెళ్లి ముహుర్తాన్ని నిర్ణయించినట్టు తెలుస్తుంది. రేపు నిఖిల్,పల్లవిల వివాహం జరగనున్నట్టు సమాచారం. మంచి ముహూర్తాలు లేకపోవడం.. మూఢం వల్ల మరో మూహూర్తం కోసం దాదాపు ఏడాది వరకు వేచి చూడాల్సి వస్తుందని హీరో నిఖిల్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్ రిసార్ట్లో కొందరు సన్నిహితుల మధ్య హీరో నిఖిల్ తన వివాహం చేసుకోకునున్నట్టు సమాచారం. షామీర్ పేట్ గెస్ట్ హౌస్ లో రేపు ఉదయం 6. 10 నిమిషాలకు పెళ్లి జరగనుందని తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా కుమారి 21 ఎఫ్ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో నిఖిల్ హీరోగా ’18 పేజీస్’ సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సుకుమార్ కథ మాటలు స్క్రీన్ ప్లే అందిస్తుండగా సుకుమార్, గీతా ఆర్ట్స్ 2 సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభినచాలనుకునేలోపు కరోనా వల్ల అది కూడా జరగలేదు. అయితే ఇంట్లో ఉంటూనే మ్యూజిక్.. పలు పనులను కానిచ్చేస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: