సూపర్ స్టార్ రజినీకాంత్కి అచ్చొచ్చిన సీజన్స్లో సంక్రాంతి ఒకటి. పొంగల్ బరిలో దిగిన రజినీ పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలోనే.. రజినీ తాజా చిత్రం ‘అణ్ణాత్త’ కూడా సంక్రాంతి సీజన్లోనే సందడి చేయనుంది. ‘శౌర్యం’ శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ని.. తొలుత ఆయుధపూజ రోజున విడుదల చేయాలని యూనిట్ భావించింది. అయితే కరోనా ఎఫెక్ట్తో 2021 సంక్రాంతికి వాయిదా వేశారు. తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అధికారికంగా ప్రకటించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. రజినీ గత చిత్రాలు ‘పేట’ (2019), ‘దర్బార్’ (2020) వరుసగా సంక్రాంతి సీజన్లోనే తెరపైకి వచ్చాయి. కట్ చేస్తే.. ‘అణ్ణాత్త’ కూడా అదే బాట పట్టడం విశేషం. మరి.. వరుసగా మూడోసారి పొంగల్ సీజన్లోనే రాబోతున్న రజినీ.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: