సూపర్ హిట్ “భద్ర ” మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన బోయపాటి శ్రీను “తులసి” , “సింహా” , “లెజెండ్”, “సరైనోడు ” వంటి సూపర్ హిట్ మూవీస్ కు దర్శకత్వంవహించారు. మాస్ చిత్ర దర్శకుడిగా పేరుపొందిన బోయపాటి శ్రీను ఈ రోజుతో 15 సంవత్సరాల సినీ కెరీర్ ను కంప్లీట్ చేసుకున్నారు. బోయపాటి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ హీరోగా #NBK106 మూవీ రూపొందిస్తున్నారు. బోయపాటి , బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందిన “సింహా” , “లెజెండ్” మూవీస్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకుడిగా సినీ కెరీర్ 15 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా బోయపాటి శ్రీను స్పందించారు. 15 సంవత్సరాల క్రితం 2005 మే 12వతేదీ దర్శకుడిగా సినీకెరీర్ ప్రారంభించానని, ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడానికి కలలు, అభిరుచి, భావోద్వేగాలతో ముందడుగు వేశానని , ఈ జర్నీ లో ప్రతీ వ్యక్తి ఇచ్చిన సపోర్ట్ తో ఎన్నో జ్ఞాపకాలు, ఛాలెంజెస్ తో సంవత్సరాలు గడిచిపోయాయని, హీరోలు, హీరోయిన్స్, ట్యాలెంటెడ్ టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్, ప్రేక్షకులు, తన ఫ్యామిలీ , దేవుడికి ఎల్లప్పుడూ రుణ పడి ఉంటానని, తనకు అందించిన ఎంకరేజ్ మెంట్, గైడెన్స్ , సపోర్ట్ కు మిమ్మల్ని ఎప్పుడూ మరచిపోనని, కృతజ్ఞతలు అంటూ బోయపాటి శ్రీను స్పందించారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: