యాక్షన్ హీరో హీరో గోపీచంద్, రేష్మ ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు. 2013 మే 12న వీరి వివాహం జరిగింది. శ్రీకాంత్ మేనకోడలు రేష్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి పెళ్లై ఏడు వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు పెళ్లిరోజు జరుపుకుంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇక ఈ రోజు పెళ్లి రోజు కావడంతో గోపీచంద్ తన భార్య గురించి చెప్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
” నా జీవితంలో నిన్ను కలిగివుండటం నేను చేసుకున్న అదృష్టం..నన్ను ఎప్పుడు హ్యాపీ గా ఉంచుతావు..హ్యాపీ యానివర్సరీ బ్యూటిఫుల్ అని ట్విట్టర్ ద్వారా తన భార్య మీద ఉన్న ప్రేమను తెలియచేశాడు.
I’m so lucky to have the most beautiful woman I call my wife in my life. You make me so happy! Happy Anniversary beautiful. ❤ pic.twitter.com/gzyN7sGZgj
— Gopichand (@YoursGopichand) May 12, 2020
ప్రస్తుతం హీరో గోపీచంద్ సంపత్ నంది కాంబినేషన్లో ‘సీటీమార్’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ యాక్ట్రస్ భూమిక ఓ కీలక పాత్ర పోషించనుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను లాక్ డౌన్ తర్వాత మిగిలిన షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేయనున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: