వేణు ఊడుగుల దర్శకత్వంలో రానా, సాయిపల్లవి కాంబినేషన్లో విరాటపర్వం 1992 అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా కొంత షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇక ఈ సినిమాలో రానా పొలిటికల్ లీడర్ గా.. సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనున్న సంగతి కూడా విదితమే. దీనికోసం ఓ మాజీ నక్సలైట్ తో ఆమె శిక్షణ తీసుకుంటున్నట్టు ఇటీవల వార్తలు కూడా వచ్చాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమాకు సంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా షూటింగ్ టైం లో యూనిట్ సభ్యులకు అనుకోని ప్రమాదం ఎదురైందట. వికారాబాద్ అడవుల్లో షూటింగ్ జరుపుకుంటున్న సమయంలో ఓరోజు యూనిట్ సభ్యులు లొకేషన్ నుండి తిరిగి వస్తుండగా… ఆ సమయంలో వారికి పెద్ద ఏనుగుల గుంపు ఎదురైందట. ఏనుగులు దాడి చేసే ప్రమాదం ఎక్కువ ఉందని భావించిన యూనిట్ సభ్యులకు ఏం చేయాలో తెలియలేదట. దాంతో వారు వెనక్కి తిరిగి పరిగెత్తారట. చాలా సేపు తర్వాత మళ్లీ వెనక్కి వచ్చి కారు తీసుకొని వచ్చేశారట.
కాగా ఇంకా ఈసినిమాలో నందితా దాస్, ప్రియమణి, ఈశ్వరీ రావ్,జరీనా వహాబ్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 1990 ల నాటి సామజిక పరిస్థితుల ఆధారం గా రూపొందుతున్న ఈ మూవీని ఎస్ ఎల్ వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: