‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. చిరు-శ్రీదేవి హీరో హీరోయిన్లుగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో.. అశ్విని దత్ నిర్మాణంలో 1990 మే 9న వచ్చిన సినిమా సినిమా చరిత్రలో ఎప్పటికీ ఒక క్లాసిక్ గానే ఉంటుంది. ఇక ఈ సినిమా 30 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఎలా ప్రారంభమైంది… ఈ సినిమాకు సంబందించిన పలు విశేషాలను సినీ ప్రేక్షకులంతో పంచుకుంటున్నారు. నాని వాయిస్ ఓవర్ తో ఈ సినిమా వీడియోస్ తీసి రిలీజ్ చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్… ఈ సీక్వెల్ పై గతంలో కూడా పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరు-శ్రీదేవి హీరో హీరోయిన్లు కాబట్టి ఈ సీక్వెల్ ను చిరు తనయుడు చరణ్, శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తో తీద్దామన్న చర్చలు కూడా జరిగాయి. అయితే ఆ తర్వాత ఈవిషయం అందరూ మర్చిపోయారు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ సీక్వెల్ తెర పైకి వచ్చింది. ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అశ్వినీ దత్ స్వయంగా చెప్పారు. తాజాగా ఆ సినిమా 30 ఏళ్లను పూర్తి చేసుకున్న సందర్భంగా అశ్వనీదత్ మాట్లాడారు. ఈ సినిమాని రీమేక్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను.. అయితే ఈ సినిమాకి సీక్వెల్ తప్పకుండా ఉంటుందని, సీక్వెల్ తీశాకే సినిమాల నుంచి రిటైర్ అవుతానని అశ్వనీదత్ ప్రకటించారు. అయితే ఆ సీక్వెల్ ఎప్పుడు, ఎవరితో తీస్తారన్నది మాత్రం చెప్పలేదు.
మరి ప్రస్తుతం వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. వందల కోట్ల బడ్జెట్ లో రూపొందించే ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఉండబోతోంది. 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఆ సినిమా ఆ తరవాతే.. జగదేకవీరుడు సీక్వెల్ ఉండొచ్చేమో చూద్దాం..
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: