వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ‘ఎఫ్2’. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘ఎఫ్2’లో వెంకటేష్, వరుణ్ తేజ్లతో అనిల్ రావిపూడి ఏ రేంజ్లో నవ్వులు పూయించాడో తెలిసిందే. అంతేకాదు రూ.120 కోట్ల గ్రాస్,రూ.80 షేర్ను రాబట్టి కలెక్షన్స్ పరంగా కూడా వెంకీ,వరుణ్ ఆఖరికి దిల్ రాజు కెరీర్ లో కూడా బెస్ట్ కలెక్షన్స్ అందించింది. ఇక ఈ సినిమా సీక్వెల్ ఉంటుందని అప్పుడే ప్రకటించారు అనిల్ రావిపూడి, దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజా సమాచారం ప్రకారం.. ఇన్ని రోజులు స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉండగా…ఇప్పుడు స్క్రిప్ట్ పూర్తయినట్టు తెలుస్తుంది. లాక్ డౌన్ తర్వాత వెంకటేష్ కు వరుణ్ కు ఈ కథను విన్పించనున్నాడట అనిల్. వీరిద్దరితో పాటు మరో హీరోను కూడా ఈ సినిమాలో తీసుకోవాలనుకుంటున్నారు. ఇక ఎఫ్2 లో చేసిన తమన్నా, మెహ్రిన్ నే మళ్ళీ తీసుకోనున్నారట. మూడో హీరోయిన్ గా ఎవరిని తీసుకుంటారో చూడాలి. ఆగస్టులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టి వచ్చేఏడాది సంక్రాంతికి ఎఫ్ 3 సినిమాతో మరో హిట్ కొట్టాలనే ప్లాన్ లో ఉన్నట్టున్నాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
కాగా ఈ ఏడాది అనిల్ రావిపూడికి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక ఈ సంక్రాంతి కి హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. మరి చూద్దాం ఈ సంక్రాంతికి మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి హ్యాట్రిక్ కొడతాడేమో.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: