యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్లో ‘పవర్ పేట్’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. తమిళనాట ఘనవిజయం సాధించిన ‘వడ చెన్నై’(2018) తరహాలో ఈ చిత్రం రూపొందనుందని టాక్. అంతేకాదు.. రెండు భాగాలుగా ఈ చిత్రం తెరకెక్కనుందని ప్రచారం సాగుతోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్లో నితిన్కు జోడిగా కీర్తి సురేష్ నటించనుండగా విలన్గా రావు రమేష్ దర్శనమివ్వనున్నాడని తెలిసింది. ఇదిలా ఉంటే.. ఈ చిత్రానికి “మెలోడీ బ్రహ్మ” మణిశర్మ బాణీలు సమకూరుస్తున్నట్టు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. నితిన్, కృష్ణచైతన్య కాంబినేషన్లో వచ్చిన గత చిత్రం ‘ఛల్ మోహన్ రంగ’(2018)కి మణిశర్మ శిష్యుడు థమన్ స్వరాలు సమకూరిస్తే.. ఇప్పుడు ఈ అప్కమింగ్ ఫిల్మ్కి థమన్ గురువు మణి స్వరకల్పన చేయనుండడం ఆసక్తిని రేకెత్తించే అంశమనే చెప్పాలి. త్వరలోనే మణిశర్మ ఎంట్రీపై క్లారిటీ రానుంది.
కాగా.. రానున్న రోజుల్లో ‘పవర్ పేట్’ సంబంధించి మరిన్ని విషయాలు అధికారికంగా వెల్లడికానున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: