కొరటాల శివ-చిరు కాంబినేషన్ ‘ఆచార్య’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు ప్రస్తుతం బ్రేక్ పడింది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో మహేష్ బాబు కానీ, చరణ్ కానీ నటిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకసారి మహేష్ బాబే నటిస్తున్నాడు అంటారు. మరో రెండు రోజులు ఆగితే లేదు లేదు చరణే నటిస్తున్నాడు అన్న వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఈ విషయంలో క్లారిటీ వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఒక ఇంటర్వ్యూ లో ఇదే ప్రశ్న చిరంజీవిని అడుగగా… దానికి చిరు నవ్వుతూ.. నేను పొరపాటున ‘ఆచార్య’ టైటిల్ ను చెప్పేశా…కానీ ఇది మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నా… అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియట్లేదు…నేనంటే మహేష్ కు ప్రేమ, అభిమానం.. అలాగే తనంటే నాకు కూడా చాలా ఇష్టం… తను కూడా నాకు బిడ్డలాంటి వాడు..తనతో సినిమా చేసే అవకాశం వస్తే అద్భుతం… ఇక ఆచార్య సినిమా విషయానికొస్తే మొదటి నుండి ఈ సినిమాలో ఓ పాత్రకు చరణ్ అయితే బావుంటదని కొరటాల శివకు మొదటినుండి ఉంది.. అయితే చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ తో బిజీ గా వున్నాడు.. ఈ సినిమా కోసం డేట్స్ ఇవ్వడంపై మొదటి నుండి అనుమానం ఉంది…రాజమౌళి, కొరటాల ఒక అండర్ స్టాండింగ్ కు వస్తే… ఈ సినిమాలో చరణ్ ఉండొచ్చు… కుదరకపోతే ఏమో..అయితే నేను చరణ్ కలిసి సినిమా చేయాలని సురేఖ కోరిక… సురేఖ కోరిక తీరుతుందో లేదో చూడాలి అని క్లారిటీ ఇచ్చారు. మరి మహేష్ లేనట్టే కదా.. మొత్తానికి ఒక క్లారిటీ వచ్చేసింది.
కాగా ప్రస్తుతం చిరు, కొరటాల దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిరుకు జోడిగా మరోసారి కాజల్ జోడి జతకట్టనుంది. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ మూవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న చిత్రయూనిట్ .. త్వరలోనే తదుపరి షెడ్యూల్ ప్రారంభించనుంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: