నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో వరుణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ బాక్సర్ గా నటించనున్నాడు. ఇక ఈసినిమా కోసం గతంలోనే ఒలింపిక్ విన్నర్ టోని జెఫ్రీస్ పర్యవేక్షణలో ట్రైనింగ్ తీసుకున్నాడు. ఇక ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా… కరోనా వల్ల ప్రస్తుతానికి షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక అయితే ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ఈ సినిమాను జూలై 30వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారట చిత్రయూనిట్. లాక్ డౌన్ అయిపోయిన తర్వాత గ్యాప్ లేకుండా షూటింగ్ జరిపి జూలై 30న రిలీజ్ చేయాలనుకుంటున్నారట. చూద్దాం మరి ఏం జరుగుతుందో…
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణ లో రినైస్సన్స్ పిక్చర్స్, బ్లూ వాటర్స్ క్రియేటివ్ బ్యానర్స్ పై అల్లు బాబీ, సిద్దు ముద్దలు నిర్మిస్తున్నారు. నిర్మాత అల్లు అరవింద్ తనయుడు వెంకటేష్ బాబీ ఈ మూవీ తో నిర్మాతగా టాలీవుడ్ కు పరిచయమవుతున్నారు. ఇందులో ప్రముఖ బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కుమార్తె సాయి మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుందని తెలుస్తోంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు… హాలీవుడ్ స్టంట్ మాస్టర్ లార్నెల్ స్టోవాల్ ఫైట్స్ ను కంపోజ్ చేస్తున్నాడు. ఇంతకుముందు వరుణ్ తేజ్ చేసిన ‘ఎఫ్ 2’ .. ‘గద్దలకొండ గణేశ్’ భారీ విజయాలను సాధించాయి. ఈ సినిమాతో ఆయన హ్యాట్రిక్ హిట్ కొడతాడేమో చూడాలి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: