కరోనా మహమ్మారి కారణంగా మనిషి మనుగడకే ముప్పు ఏర్పడింది. ప్రాణాంతక వ్యాధి కరోనా వైరస్ ను అరికట్టడానికి అవగాహనా కల్పిస్తూ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంగీత దర్శకుడు కోటి స్వరకల్పనలో రూపొందిన, టాలీవుడ్ హీరోలు అభినయించిన వీడియో సాంగ్ కు అద్భుత రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఆ వీడియో ను వీక్షించిన ప్రధాని మోదీ టాలీవుడ్ హీరోలను ట్విట్టర్ ద్వారా అభినందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిరంజీవిగారికీ, నాగార్జునగారికీ, వరుణ్ తేజ్ కీ, సాయి ధరమ్ తేజ్ కీ మీరందరూ ఇచ్చిన అతి చక్కని సందేశానికి నా ధన్యవాదాలు.
అందరం మన ఇళ్ళల్లోనే ఉందాం.
అందరం సామాజిక దూరం పాటిద్దాం.
కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం. #IndiaFightsCorona https://t.co/01dO5asinD
— Narendra Modi (@narendramodi) April 3, 2020
చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయి తేజ్ లకు మీరు ఇచ్చిన అతి చక్కని సందేశానికి ధన్యవాదాలు అని, అందరం ఇళ్ళలోనే ఉందాం , సామాజిక దూరం పాటిద్దాం, కరోనా వైరస్ పై విజయం సాధిద్దాం అంటూ ప్రధాని మోదీ తెలుగు లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీ ట్వీట్ కు చిరంజీవి రిప్లై ఇస్తూ సంగీత దర్శకుడు కోటి గారు , మా అందరి తరఫున మీకు ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. ప్రజలందరూ ఇళ్ళకే పరిమితం అయ్యి కరోనా మహమ్మారి ని ఓడిద్దాం. స్టే హోమ్ ,స్టే సేఫ్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: