క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలాఉండగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్. ఈ సినిమాలో పవన్కు జోడిగా జాక్వెలిన్ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అయితే బావుంటుందని.. అందుకే జాక్వెలిన్ ను అనుకుంటున్నారట. ఇప్పటికే ఈ సినిమాపై దర్శకుడు క్రిష్, జాక్వెలిన్ మధ్య చర్చలు కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. మరి చూద్దాం ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే. కాగా సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెలుగులో పింక్ చిత్రాన్ని రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. నిజానికి ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకున్నారు. అయితే కరోనా వల్ల ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: