కరోనా.. కరోనా.. కరోనా ఎక్కడ చూసినా ఈ మాట తప్ప ఇంకేం వినిపించట్లేదు. ఎవరు మాట్లాడుకున్నా ఇఇ విషయం గురించే.. టీవీ లు పెట్టినా ఇదే న్యూస్.. ఇక ప్రజలైతే ఎక్కడికి వెళ్లాలన్నా భయపడుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాలైతే లాక్ డౌన్ చేసేసారు. ఏదో కనీస అవసరాలు తీర్చుకోడానికి తప్పితే ప్రజలను బయటకు రానివ్వట్లేదు ప్రభుత్వ అధికారులు. స్కూల్స్, ఆఫీస్ లు, థియేటర్స్, మాల్స్ ఇలా అన్నీ మూతపడ్డాయి. షూటింగులు, ప్రీ ప్రొడక్షన్ మరియు పోస్ట్ ప్రొడక్షన్, ఈవెంట్లు అన్ని రకాల కార్యక్రమాలు కూడా వాయిదా పడ్డాయి. దీనితో సెలెబ్రిటీస్ కూడా ఇంట్లోనే ఉండి మంచిగా ఫ్యామిలీస్ తో గడుపుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఈ ప్రభావం వల్ల సినీ ప్రముఖులకు పెద్దగా ఎలాంటి నష్టం ఉండదు. వాళ్ళకి కొంతకాలం వరకు సినిమాలు లేకపోయినా, పని లేకపోయినా ఆర్థిక పరిస్థితికి మాత్రం ఏమి లోటు రాదు. కానీ సినిమా ఇండస్ట్రీలో “రెక్కాడితే కానీ డొక్కాడని” ప్రజలు 60 శాతం మంది ఉన్నారు. వారి పరిస్థితి కొంచెం కష్టమే. ఇక వారి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సూపర్ స్టార్ రజినీకాంత్ “ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా” సంస్థకు 50 లక్షల విరాళం ప్రకటించారు. ఈ “ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అనే సంస్థ” లో దక్షిణ భారత దేశ వ్యాప్తంగా సుమారు పాతిక వేల మందికి పైగా సభ్యులు ఉన్నారు. ఇరవై మూడు విభాగాలకు సంబంధించి కార్మికులు ఇందులో సభ్యులు గా ఉన్నారు. ఇక మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 10 లక్షల రూపాయల విరాళం ప్రకటించారు. మొత్తానికి రీల్ లైఫ్ లోనే రియల్ లైఫ్ లో కూడా హీరోలనిపిస్తున్నారు మన సెలెబ్రిటీస్.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: