`చిత్రలహరి` వంటి విజయవంతమైన చిత్రం తరువాత మెగా కాంపౌండ్ హీరో సాయితేజ్, టాలెంటెడ్ బ్యూటీ నివేదా పెతురాజ్ కాంబినేషన్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `ప్రస్థానం` ఫేమ్ దేవ కట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీలో సీనియర్ యాక్ట్రస్ రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించనుందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఏలూరు నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో సాయితేజ్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే.. ఇందులో సాయితేజ్ డాక్టర్ పాత్రలో కనిపిస్తాడట. అదే గనుక నిజమైతే… వైద్యుడి పాత్రలో సాయితేజ్ నటించడం ఇదే తొలిసారి అవుతుంది. కాగా, ఈ ఏడాది చివరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ జనం ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. సాయితేజ్ అప్ కమింగ్ ఫిల్మ్ `సోలో బ్రతుకే సో బెటర్` మే 1న విడుదల కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: