`ఆర్ ఎక్స్ 100`తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ ని తన ఖాతాలో వేసుకుంది. అయితే, ఆ తరువాత మాత్రం ఆ స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది ఈ టాలెంటెడ్ బ్యూటీ. కాకపోతే, సీనియర్ స్టార్ వెంకటేష్ తో కలసి నటించిన `వెంకిమామ` కాస్త ఊరటనిచ్చింది. కాగా, మరో సీనియర్ హీరోతో పాయల్ నటించే అవకాశముందని ఫిల్మ్ నగర్ సర్కిల్స్ తో కథనాలు వినిపిస్తున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే.. నటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు నాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా పాయల్ ని నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట. ప్రస్తుతం ఈ మేరకు సంప్రదింపులు జరుగుతున్నాయని టాక్. త్వరలోనే `యన్.బి.కె. 106`లో పాయల్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. అన్నట్టు.. బాలయ్య `యన్టీఆర్ కథానాయకుడు` కోసం జయసుధ పాత్రలో తళుక్కున మెరిసింది పాయల్. మరి.. అతిథి పాత్రలో బాలయ్య పక్కన సందడి చేసిన ఈ బ్యూటీ.. నాయికగా ఏ స్థాయిలో మురిపిస్తుందో చూడాలి.
ఇదిలా ఉంటే… ప్రస్తుతం పాయల్ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్`5Ws`లో నాయికగా నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: