మొదట ఐరెన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది.. కానీ ఇప్పుడు ఆమె కాళ్ల మీదే పాట రాసే స్థాయికి ఎదిగింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో ఐడియా వచ్చే ఉంటది. ఆ బుట్టబొమ్మ ఎవరో కాదు పూజా హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే కి మొదట అన్నీ ఫ్లాప్సే పలకరించాయి. ఆ ఆతర్వాత దువ్వాడ జగన్నాథం సినిమాతో కాస్త ఫామ్ లోకి వచ్చి.. ఇటీవల వరుస హిట్స్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఏ సినిమాలో అయినా ఫస్ట్ ఛాయస్ గా పూజా హెగ్డే పేరునే సెలెక్ట్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ అమ్మడు ప్రస్తుతం ప్రభాస్ 20వ చిత్రంలో కథానాయికగా నటిస్తుంది. అలానే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోను లీడ్ రోల్ పోషిస్తుంది.హిందీలో సల్మాన్ ఖాన్ సరసన కభీ ఈద్ కభీ దీవాళి అనే చిత్రంలోను నటిస్తుంది.
ఇదిలా ఉండగా తాజాగా పూజా హెగ్డే ఫీమేల్ సెంట్రిక్ చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. పడిపడి లేచే మనసు, లై, కృష్ణ గాడి వీరప్రేమ గాథ వంటి చిత్రాలని తెరకెక్కించి హను రాఘవపూడి రీసెంట్గా పూజాని కలిసి స్టోరీ వినిపించాడట. ఈ స్టోరీకి ఎంతగానో కనెక్ట్ అయిన పూజా సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ రావలసి ఉంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: