మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఆచార్య`. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రూపొందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన చిత్రీకరణ మెరుపు వేగంతో జరుగుతోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే.. `ఆచార్య`లో త్రిష కథానాయికగా నటిస్తుండగా… ఓ ప్రత్యేక గీతంలో రెజీనా సందడి చేయనుంది. ఈ విషయాన్ని ఇటీవల స్వయంగా వెల్లడించింది రెజీనా. సినిమాలో ప్రత్యేక సందర్భంలో వచ్చే గీతమిదని… సెలబ్రేషన్ సాంగ్ గా ఈ పాట వస్తుందని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. మెగాస్టార్ తో నర్తించే అవకాశం అని చెప్పగానే వెనువెంటనే ఒప్పుకున్నానని.. తన కెరీర్ లో ఇదే తొలి, చివరి ప్రత్యేక గీతం కావచ్చని రెజీనా తెలిపింది. మరి.. చిరుతో రెజీనా ఆడిపాడిన ఆ పాట ఎలా ఉంటుందో తెలియాలంటే ఆగస్టు వరకు వేచిచూడాల్సిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: