రానా, సాయిపల్లవి జంటగా `విరాటపర్వం` పేరుతో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. `నీదీ నాదీ ఒకే కథ` ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని డి. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తుది దశకు చేరుకున్న ఈ సినిమాకి సంబంధించిన చివరి షెడ్యూల్ త్వరలో ప్రారంభం కానుంది. కాగా, పిరియాడిక్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. హాలీవుడ్ కెమెరామ్యాన్ డానీ సాంచెజ్ లోపెజ్ ఈ చిత్రానికి ఛాయాగ్రహణం అందిస్తుండగా… హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ స్టీఫెన్ రిచెర్ పోరాటఘట్టాలకు యాక్షన్ కొరియోగ్రఫీ సమకూర్చుతుండడం విశేషం. ఈ రెండు అంశాలు కూడా సినిమాకి ప్రత్యేక ఆకర్షణ అవుతాయని చిత్ర వర్గాల సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రియమణి, నందితా దాస్, జరీనా వహాబ్, ఈశ్వరీ రావు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న `విరాటపర్వం`.. వేసవి చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: